వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ద్రవ్య బిల్లుపై విపక్షాల ధ్వజం
హైదరాబాద్:
ద్రవ్య
వినయోగ
బిల్లుపై
విపక్షాలు
శనివారం
శాసనసభలో
ప్రభుత్వంపై
తీవ్రంగా
ధ్వజమెత్తాయి.
ఆర్థిక
మంత్రి
యనమల
రామకృష్ణుడు
ద్రవ్య
వినియోగ
బిల్లును
ప్రతిపాదించారు.
సాగునీరు, విద్యుత్, బలహీనవర్గాల సంక్షేమం వంటి ప్రధాన రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బలహీనవర్గాలవారీగా కేటాయింపులు జరపడం అవసరమని ప్రతిపక్షాలు అన్నాయి. అనుత్పాదక రంగాలపై ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడుతోందని, అప్పులపై వడ్డీల చెల్లింపులో అధిక మొత్తం ఖర్చు చేస్తోందని విమర్శించాయి.
బడ్జెట్ ముసాయిదాలపై ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం ఏ మాత్రం విలువ ఇవ్వలేదని అన్నాయి. అప్పులు 60 వేల కోట్లకు చేరబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నాయి.
Comments
Story first published: Saturday, March 29, 2003, 23:53 [IST]