వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణం సమీపంలోని కొల్లకొంటచెరువు వద్ద జరిగిన దుర్ఘటనవివరాలు...హిందూపురం నుంచి బయలుదేరిన ఓ బస్సు టకూరు వెళుతోంది. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయాలన్న ప్రయత్నంలో ఎదురుగా వస్తోన్న ఆటోను బస్సు ఢీకొంది.

వేగంగా వస్తోన్న ఈ బస్సు ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జుఅయింది. అందులో ప్రయాణిస్తోన్న ముగ్గురు ప్రయాణీకులు ప్రసాద్‌(38), గోపాల్‌ (36), ఆదిలక్ష్మమ్మ (40)లు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ శివకుమార్‌ మరో ఇద్దరు ఆటోలోని ప్రయాణీకులు తీవ్రంగా గాయపడగా వారిని హిందూపరం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తోన్న ప్రయాణీకులుఅందరూ సురక్షితంగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X