వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ పై రేపు ఉన్నతాస్థాయి సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 24 మందిహిందువుల ఊచకోత, ఇరాక్‌ యుద్దం నేపథ్యంలో కాశ్మీర్‌లో శాంతిభద్రతను సమీక్షించేందుకు సోమవారం ఉపప్రధానిఎల్‌.కె.అద్వానీ ఉన్నతాస్థాయి సమావేశాన్నిఏర్పాటుచేశారు. ముప్తీ మహమ్మద్‌ సయిద్‌నేతృత్వంలోని అక్కడి రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తోన్న సాంత్వన చేకూర్చే విధానంతో పాటు పలుఅంశాలపై కేంద్రం అసంతృప్తితో ఉంది.

కాశ్మీర్‌ లో శాంతిభద్రతలవిషయంలో కేంద్రం రాజీపడకూడదనే వాదనవినిపిస్తోన్న తరుణంలో అద్వానీ ఈ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌, కాశ్మీర్‌ ముఖ్యమంత్రిముప్తీ, ఆ రాష్ట్ర గవర్నర్‌ జి.సి.సక్సేనా ..తదితర ఉన్నతస్థాయినాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశంఉంది. ముప్తీ ప్రభుత్వ విధానాలు దేశభద్రతకు విఘాతంకల్గించే ప్రమాదం ఉందని, అలాగే తీవ్రవాదంపై పోరుకు ఇవిఅడ్డంకి అని కేంద్రం భావిస్తోంది. అలాగే ఈసమావేశంలో కాశ్మీర్‌ పండిట్లకు పునరావాస కల్పన గురించి కూడాచర్చిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X