ఇది స్కామ్ ల ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: వాజ్ పేయి స్కామ్ ల ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియాగాంధీ తీవ్రవిమర్శలు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో పార్టీ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆమె పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగావిఫలమైందని సోనియా పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం అవినీతిమయ ప్రభుత్వం. ఆఖరికివీరసైనికుల మృతదేహాల శవపేటికలను వదిలిపెట్టలేదు.ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విధానం వల్లే దేశంలోని 15 రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నామన్నారు. రైతుల సంక్షేమం, మహిళలకు సమప్రాధాన్యం, యువతకు చక్కటి భవిష్యత్అందించే దిశగా పనిచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందనివివరించారు.
దేశభద్రత విషయంలో పార్టీ విభేదాలకతీతంగా ప్రభుత్వం పక్షాన నిలిచామన్నారు.అయినప్పటికీ అక్షరధామంపై దాడి, అమర్ నాథ్ యాత్రికులపై దాడి వంటి అమానుష తీవ్రవాద చర్యలను వాజ్పేయి ప్రభుత్వం నిరోధించలేకపోయిందని సోనియా ఘాటుగావిమర్శించారు.
హిందూయిజానికి వీఎచ్ పి ఇస్తోన్నఅర్థాన్ని ఆమె తప్పుబట్టారు. హిందూమతం సామాజక, దేశ ఐక్యత గురించి ప్రభోధిస్తోంది. దేశ అభివృద్ధికి దేశ ఐక్యత ముఖ్యం. అని ఆమె అభిప్రాయపడ్డారు.