నల్గొండలో ప్రమాదం, 9మంది మృతి
హైదరాబాద్: హైదరాబాద్-నల్గొండ రహదారిపై మంగళవారం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వేగంగా వస్తోన్న ఒక కల్లు లారీ - నల్గొండ నుంచి వస్తోన్న ఇసుక లారీని, ఒక ఆర్టీసీ బస్సును ఢీకొంది.
నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కల్లు లారీ తొలుత ఇసుక లారీని ఢీకొని..అదే వేగంతో ఆర్టీసీ లగ్జరీ బస్సును ఢీకొంది. దీంతో లారీ, ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇసుక లారీ క్యాబిన్ లో ప్రయాణిస్తోన్న ఏడుగురు మరణించారు. మొత్తం తొమ్మిది మంది ఈ ఘటనలో మృతిచెందగా ఆరుగురుఒకే కుటుంబానికి చెందినవారు కావడం అందర్నీ కలిచివేస్తోంది.
ఇసుక లారీలో ప్రయాణిస్తోన్న వారు వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినవారు. ఉగాది పండుగ సందర్భంగా ఇంటికి వస్తోన్న వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. సమాచారంఅందిన వెంటనే అగ్నిమాపక దళం సిబ్బింది హుటాహుటిన ఘటనాస్థలానిక చేరుకొని ఆర్టీసీ బస్సులో వ్యాపించన మంటలను చల్లార్చారు.
బస్సులో ప్రయాణీకులు కొందరు గాయపడినప్పటికీమిగతా అందరూ క్షేమంగా బయటపడ్డారు. కల్లు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తు సాగిస్తోన్న పోలీసులు తెలిపారు.