వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ చెర వీడని పోలీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: నలుగురు పోలీసుల కిడ్నాప్‌ వ్యవహారంలో ఇంకా అనిశ్చిత స్థితి కొనసాగుతోంది. నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ప్రకాశం జిల్లా పెద్దారవీడు పోలీసులను నలుగుర్ని కిడ్నాప్‌ చేశారు. వీరి కిడ్నాప్‌నకు గల కారణాలేమిటో తెలియలేదు. నక్సలైట్లు ఏ విధమైన డిమాండ్లను గురవారం ఉదయం వరకు కూడా తెలియజేయలేదు.

పోలీసులను విడిపించడానికి ఉన్నతాధికారులు పౌర హక్కుల నేతలతో ప్రయత్నాలు ప్రారంభించారు. మరో వైపు గాలింపు చర్యల కోసం పెద్ద యెత్తున గ్రేహౌండ్స్‌ను దించినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు మార్కాపురంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు 1500 మంది మార్కాపురం చేరుకున్నారు. వీరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్కడికి చేరుకున్నారు. తమవారిని వదిలిపెట్టాలని పోలీసుల కుటుంబాలు నక్సల్స్‌కు విజ్ఞప్తి చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X