వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ చేతిలో ఇద్దరి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌/ఖమ్మం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మాజీ నక్సలైట్‌ ఒకర్ని హత్య చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని వనచింతలపల్లిలో జరిగింది.

గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వెంకటస్వామి అనే మాజీ నక్సలైట్‌ను నక్సలైట్లు కాల్చి చంపారు. వెంకటస్వామి పీపుల్స్‌వార్‌ దళ సభ్యుడిగా పని చేశాడు. నిరుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే ఆరోపణపై నక్సలైట్లు అతడ్ని హత్య చేశారు.

ఖమ్మం జిల్లాలో నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు తెలుగుదేశం నాయకుడు జనార్దన్‌ రెడ్డిని హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే ఆరోపణతో నక్సల్స్‌ ఆయనను చంపారు. వరంగల్‌ జిల్లా మంగంపేట లోకల్‌ గెరిల్లా దళం నక్సలైట్లు బుధవారం రాత్రి ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X