వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూత్వ భారతీయ ఆత్మ: వెంకయ్య
ఇండోర్:
వచ్చే
ఎన్నికల్లో
హిందూత్వం
ఎన్నికల
ఎజెండా
కాదని
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
అధ్యక్షుడు
ఎం.
వెంకయ్యనాయుడు
స్పష్టం
చేశారు.
బిజెపి
కీలక
కార్యవర్గ
సమావేశం
శుక్రవారంనాడిక్కడ
ప్రారంభమైంది.
హిమాచల్
ప్రదేశ్లో
పార్టీ
ఓటమికి
క్రమశిక్షణారాహిత్యమే
కారణమని
ఆయన
ఈ
సమావేశం
ప్రారంభోపన్యాసంలో
అన్నారు.
లోక్సభ ఎన్నికల ఫైనల్కు వచ్చే మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీల ఎన్నికలు సెమీ ఫైనల్ అని ఆయన వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ 300 సీట్లు గెల్చుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
హిమచల్ ప్రదేశ్లో తమ ఓటమిని హిందూత్వ ఓటమిగా అన్వయించి చెప్పారని, రాజకీయ యుద్ధరంగంలో హిందూత్వం తమకు ఎన్నికల అంశం కాదని ఆయన అన్నారు. సాంస్కృతిక జాతీయవాదం తమ జీవన విధానమని, హిందూత్వం భారతీయ ఆత్మ అని ఆయన అభివర్ణించారు.
Story first published: Thursday, April 3, 2003, 23:53 [IST]