వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిగ్ కూలి నలుగురు మృతి
లూథియానా: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23 ఫైటర్ కూలి నలుగురు మరణించారు. మరణించినవారిలో ముగ్గురు మహళలు, ఒక పసిపాప ఉన్నారు. ఇందులో ఐదుగురు గాయపడ్డారు.
లూథియానాలోని ముల్లన్పూర్ డక్కాలోని నివాస ప్రాంతంలో ఈ విమానం కూలింది. జెట్ ట్రాక్టర్ మెకానిక్ భోలా ఇంటిపై కూలింది. మరణించినవారందరూ అతని కుటుంబానికి చెందినవారే. పైలట్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. గాయపడినవారిలో నలుగురి శరీరాలు 90 శాతం వరకు కాలాయి. గాయపడినవారిని లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. హల్వారా నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఫైటర్ విమానం శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కూలిపోయింది.
Story first published: Thursday, April 3, 2003, 23:53 [IST]