వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అక్రమాలపై కఠిన చర్యలు: బాబు
మెదక్: వాటర్షెడ్ అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఆయన శనివారం మెదక్ జిల్లా కొండపాక మండలం ఎల్లారెడ్డిపేట వాటర్షెడ్ పనులను అడిగి తెలుసుకున్నారు. జలచైతన్యం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వాటర్షెడ్ కార్యక్రమాల్లో అక్రమాలు జరిగితే ఆస్తులు వేలం వేసి డబ్బులు రాబడుతామని కూడా ఆయన చెప్పారు. వాటర్షెడ్ పనుల్లో అవకతవకలు జరిగితే జిల్లా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తోగుంట మార్కెటింగ్ యార్డును ఆయన సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జలచైతన్య కార్యక్రమాలు జరిగాయి. సదస్సులు, ర్యాలీలు జరిగాయి.
Comments
Story first published: Saturday, April 5, 2003, 23:53 [IST]