వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జగన్నాథ్‌ మిశ్రా ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ వి.సి. పాండే అనుమతి ఇచ్చారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన మరోకేసులో గవర్నర్‌ ఈ అనుమతి ఇచ్చారు.

ఇటీవల న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మిశ్రాలను ప్రాసిక్యూట్‌ చేయడానికి బీహార్‌ గవర్నర్‌ కేంద్ర దర్యాప్తు బృందానికి అనుమతి ఇచ్చారు.

వీరిద్దరిపై ఛార్జిషీట్‌ దాఖలు చేయడానికి సిబిఐ చాలా కాలం క్రితం అనుమతి కోరింది. ఈ కేసులో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రులు సి.పి. వర్మ, విద్యాసాగర్‌ నిషాద్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ శాసనసభ్యుడు ఆర్‌.కె. రాణా, స్వతంత్ర శాసనసభ్యుడు జగదీష్‌ శర్మలతో పాటు పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులు నిందితులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X