వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాలూ ప్రాసిక్యూషన్కు అనుమతి
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా ప్రాసిక్యూషన్కు గవర్నర్ వి.సి. పాండే అనుమతి ఇచ్చారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన మరోకేసులో గవర్నర్ ఈ అనుమతి ఇచ్చారు.
ఇటీవల న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్, మిశ్రాలను ప్రాసిక్యూట్ చేయడానికి బీహార్ గవర్నర్ కేంద్ర దర్యాప్తు బృందానికి అనుమతి ఇచ్చారు.
వీరిద్దరిపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సిబిఐ చాలా కాలం క్రితం అనుమతి కోరింది. ఈ కేసులో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రులు సి.పి. వర్మ, విద్యాసాగర్ నిషాద్, రాష్ట్రీయ జనతాదళ్ శాసనసభ్యుడు ఆర్.కె. రాణా, స్వతంత్ర శాసనసభ్యుడు జగదీష్ శర్మలతో పాటు పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులు నిందితులు.
Story first published: Saturday, April 5, 2003, 23:53 [IST]