వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతితో తెలుగు పిల్లలు
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన ఐదుగురు పిల్లలు రాష్ట్రపతిని కలుసుకున్నారు. పిల్లలను కలుసుకుని వారితో గడపడంతో భారత రాష్ట్రపతికి ఎంతో మక్కువ అనే విషయం తెలిసిందే.
దేశంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఆయన తన నివాసంలో కలుసుకుని వారితో గడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐదుగురు రాష్ట్రపతిని కలుసుకోవడానికి ఢిల్లీ వచ్చారు. వారు ఈ రోజంతా రాష్ట్రపతితో గడిపారు. ఈ పిల్లలతో రాష్ట్రపతి మొఘల్ గార్డెన్లో తిరిగారు.
Comments
Story first published: Saturday, April 5, 2003, 23:53 [IST]