వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ డిమాండ్లను పరిశీలిస్తున్నాం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తమ చెరలో ఉన్న పోలీసుల విడుదల కోసం నక్సల్స్‌ చేసిన డిమాండ్లపై ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. అయితే, పోలీసుల విడుదల కోసం నక్సల్స్‌ చేసిన డిమాండ్లను పరిశీలిస్తున్నామని రాష్ట్ర హాంశాఖమంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ ఆదివారం తెలిపారు. విజయవాడ పట్టణంలో శాఖాపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హోంమంత్రి విలేకరులతో మాట్లాడారు.

నక్సల్స్‌ డిమాండ్ల లిస్ట్‌ ను అధికారులు తనకు శనివారం నాడే పంపినట్లు ఆయన చెప్పారు. సోమవారం ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ఉన్నతాస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అప్పుడే వీటి సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామన్నారు. నక్సల్స్‌ చర్యలను ఆయన ఖండించారు. అయితే, దూతలను పంపించే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. వీరప్పన్‌ తో కర్ణాటక ప్రభుత్వం నడిపిన రాయబారం పద్దతిలో తాము చర్యతీసుకోలేమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X