త్వరలోనే పట్టాలపై ఫాస్టెస్ట్ రైలు
ఆగ్రా: గంటకు సుమారు 150 కి.మీల వేగంతో దేశంలోనే ఫాస్టెస్ట్ రైలు ఈ ఏడాదిలోనే పట్టాలపైకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి నితీష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో పేర్కొన్నట్లుగానే ఫాస్టెస్ట్ రైలును మరో రెండు, మూడు నెలల్లో అమలుపరుచనున్నట్లు ఆయన ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ రైలును కోంకణ్ రైల్వేస్ నిర్వహిస్తుందన్నారు.
గంటకు 180 కి.మీ వేగంతో ఈ రైలును పరీక్షించాం. కానీ జంక్షన్లు, క్రాస్ లింక్ లను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని దీని స్పీడును 150కి తగ్గించాం. దేశంలోనే అత్యంత అత్యాధునికమైన కొంకణ్ రైల్వే సంస్థ దీన్ని నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లో అత్యంతవేగంతో నడుస్తోన్న రైళ్ళుబండ్లు. ఇవి గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయి.
అయితే, దేశమంతటా ట్రాక్ లైన్లు అభివృద్ధి చెందితే, మరిన్ని ఫాస్టెస్ట్ రైళ్ళను ప్రవేశపెట్టేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. దశలవారీగా అన్ని ట్రాక్ లను ఆధునీకరిస్తున్నామని నితీష్ కుమార్ వివరించారు.
గ్లోబల్ పోజిసనింగ్ సిస్టమ్ (జిపిఎస్) ద్వారా రైలు ప్రమాదాలను నివారించడం సులభతరం అవుతుందని, యాంటి కొల్లిసన్ పరికరాల ఏర్పాటు తొలిదశ పనులను దక్షిణమధ్య రైల్వేలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇరాక్ యుద్ద నేపథ్యంలో రైల్వే ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఏడాది ఛార్జీలు పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు.