వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్బంద్పాక్షికం, ప్రశాంతం
హైదారాబాద్: వార్ అగ్రనేత ఆర్కే ఎన్ కౌంటర్ కు నిరసనగా పీపుల్స్ వార్ గ్రూప్ ఇచ్చిన బంద్ పిలుపునకు పాక్షిక స్పందన వచ్చింది. మంగళవారం రాష్ట్ర రాజధానిలో అన్ని కార్యకలాపాలు యధావిధిగా జరిగాయి. వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఏవీ మూతబడలేదు. ఆర్కే సొంత జిల్లా వరంగల్ లో మాత్రం బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
బంద్ ను పురస్కరించుకొని మంగళవారం ఉత్తర తెలంగాణా అంతా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. వరంగల్ లో బంద్ ను విఫలం చేసేందుకు పోలీసులు బలవంతంగా పెట్రోల్ బంక్ లను, సినిమా థియేటర్లను తెరిపించారు. అయితే, ఇక్కడ ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు.
Story first published: Tuesday, April 8, 2003, 23:53 [IST]