వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మే1 నుంచి కొత్తసెల్ టారిఫ్
న్యూఢిల్లీ: కొత్త టారిఫ్ విధానాన్ని మే1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని భారతీయ సెల్ ఫోన్ ఆపరేటర్ల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ కంపెనీలు ఇక ఇంటర్ కనెక్షన్ ఛార్జీలు వసూలు చేస్తాయి.
అలాగే, అన్ని ఇన్ కమింగ్ కాల్స్ ఇక అన్ని ప్యాకేజీల్లోనూ ఉచితం. మంగళవారం అన్ని ఆపరేటర్లతో న్యూఢిల్లీలో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ...మే1 నుంచి తాము సిద్దమని ఆపరేటర్లు ట్రాయ్ కు తెలిపారు. అయితే, సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Story first published: Tuesday, April 8, 2003, 23:53 [IST]