వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్, పాక్ లు చర్చలు జరపాలి: చైనా
బీజింగ్: ముందు జాగ్రత్త చర్యగా దాడికి దిగే అవకాశాలపై భారత్, పాకిస్థాన్ లు ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని పేర్కొంది. పాకిస్థాన్, భారత్ ల తమ మధ్య సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది.
వివాదాలు, భేదాభిప్రాయాలు శాంతిపూర్వకమైన చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలనేది చైనా అభిమతం. యుద్దం ద్వారా కన్నా చర్చలే మేలు అనేది మా పాలసీ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధఙ లై జువాన్ చూ తెలిపారు.
భారత్, పాక్ లు రెచ్చగొట్టేకొనే విధంగా ప్రకటనలు చేయడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియా శాంతియుత వాతావరణం నెలకొనలంటే ఇలాంటి ఉద్రేకపూరితమైన ప్రకటనలను మానుకోవాలని సూచించింది.
Comments
Story first published: Tuesday, April 8, 2003, 23:53 [IST]