తీవ్రవాదుల చేతిలో 5గురు బలి
చెన్నై: బందీపోటు దొంగ, స్మగ్లర్వీరప్పన్ బలగాన్ని బాగా తగ్గించగలిగామని తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత తెలిపారు. ఒకప్పుడు భారీ ఎత్తునఅనుచరగణంతో స్మగ్లింగ్ కు పాల్పడిన వీరప్పన్ ప్రస్తుతబృందంలో వేళ్ళ మీద లెక్కించేంత మంది కూడా లేరనిజయలలిత మంగళవారం తమిళనాడు అసెంబ్లీలోప్రకటించారు. వీరప్పన్ ను పట్టుకోవడంలో తమిళనాడు ప్రభుత్వంవిఫలమైందన్న విఫక్షాల వాదనను ఆమెకొట్టిపారేశారు.
తమిళనాడు, కర్ణాటకలకుచెందిన రెండు ఎస్టీఎఫ్ దళాలు కలిసికట్టుగాపనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే, వీరప్పన్ ఎప్పటికీపరారీలోనే ఉంటూ..ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంతోఎస్టీఎఫ్ దళాలకు అతను చిక్కకుండాపోతున్నాడని ఆమె తెలిపారు. ఈ ఏడాది జనవరి 2నకేంద్ర హోంమంత్రి ఎల్.కె.అద్వానీతో జరిగిన ప్రత్యేకసమావేశంలో - ఇరు రాష్ట్రాలకు అదనపు కేంద్రబలగాలనుఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని జయలలిత సభకు తెలిపారు.త్వరలోనే వీరప్పన్ ను పట్టుకోగలమని ఆమెవిశ్వాసం వ్యక్తం చేశారు.