వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేన్స్‌ జ్యూరి మెంబర్‌గాఐశ్వర్య

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. జ్యూరీకి ఎంపికైన తొలి భారతీయ మహిళ ఐశ్వర్యారాయ్‌ కావడం గమనార్హం. కేన్స్‌ చలన చిత్రోత్సవం మే 14వ తేదీన ఫ్రాన్స్‌లో ప్రారంభమవుతుంది.

జ్యూరీ మెంబర్‌గా హాజరవుతానని ఐశ్వర్యారాయ్‌ చలనచిత్రోత్సవ అధ్యక్షుడు గిల్లీ జాకబ్‌కు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. దేవదాసు చిత్రాన్ని ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ పార్వతి పాత్ర పోషించారు.

హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నటి బుధవారంనాడు డిశ్చార్జి అయ్యారు. ఆమె జేమ్స్‌బాండ్‌ చిత్రాలను నిర్మిస్తున్న లండన్‌కు చెందిన స్టూడియో ఏజెంట్లతో సమావేశమయ్యారు. దీంతో వచ్చే జేమ్స్‌బాండ్‌ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ పీయర్స్‌ బ్రోస్నన్‌ సరసన నటించే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు తుది రూపం ఇచ్చేందుకు ఐశ్వర్యరాయ్‌ మేలో లండన్‌ వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X