పసిపాప మృతితో వరంగల్లో ఉద్రిక్తత
వరంగల్: పసిపాప మృతికికారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో ఆ పాప కుటుంబ సభ్యులు, మహిళాసంఘాలు,స్వచ్ఛంద సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో శుక్రవారం వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది.
సికెఎం ఆస్పత్రిలో సుజాత అనే మహిళ ఈ నెల 9వ తేదీ రాత్రి ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప మరణించిందని చెప్పి వైద్యులు ఆ పాపను బట్టలో చుట్టిపంపారు. బట్టల్లో చుట్టిన పాపను తీసుకుని సుజాత ఇంటికి వెళ్లిపోయింది. తెల్లారి ఏడుపువినిపించి పాప బతికే ఉన్నదని గమనించిన తల్లి సుజాత, ఆమె బంధువులు మళ్లీ సికెం ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆ పాపను చూడకుండా ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లేసరికి ఆ పాపమరణించింది. దీంతో ఆగ్రహించిన సుజాత కుటుంబసభ్యులు, మహిళా సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాప మరణానికికారకులైన వైద్యులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.