వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాపై భారత్‌ భారీ విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

ఢాకా: టివిఎస్‌ కప్‌ వన్డే క్రికెట్‌ పోటీలో శుక్రవారం బంగ్లాదేశ్‌పై భారత్‌ భారీవిజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 200 పరుగుల తేడాతో భారత్‌విజయాన్ని చేజిక్కించుకుంది. భారత్‌ ఉంచిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. బంగ్లాదేశ్‌ 27.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలవుట్‌అయింది.

భారత ఫాస్ట్‌ బౌలర్లు బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలుపెట్టారు. జహీర్‌ ఖాన్‌ 7.3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 నాలుగువికెట్లు తీసుకున్నాడు. అజిత్‌ అగార్కర్‌ మూడు, అవిష్కార్‌ సాల్వి రెండువికెట్లు, హర్బజన్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 276 పరుగులు చేసింది. యువరాజ్‌ సింగ్‌ వన్డేల్లో తన తొలిసెంచరీని నమోదు చేసుకున్నాడు. యువరాజ్‌ 85 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అతనిసెంచరీలో నాలుగు సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. సెహ్వాగ్‌ 63 పరుగులు చేసి రఫీక్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.మిగతా భారత బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.సెహ్వాగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన గంభీర్‌ 11 పరుగులు మాత్రమే చేశాడు. గంగూలీ 30 పరుగులు చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X