నక్సల్స్ చెర నుంచి పోలీసుల విడుదల
మార్కాపూర్: ఉగాది నాడు కిడ్నాప్ నకుగురైన మార్కాపురం పోలీసులు వార్ నుంచి బంధవిముక్తులు అయ్యారు. శుక్రవారం ఉదయం ముగ్గురు పోలీసులనుపీపుల్స్ వార్ విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దీంతో తొమ్మిదిరోజులు ఉత్కంఠకు తెరపడింది. ఎస్.ఐ. పి. ఆంజనేయలు, అసెస్టింట్ ఎస్.ఐ (కమ్యూనికేషన్స్) ఎం.సుబ్బారావు, కానిస్టేబుల్ ఎస్.బ్రహ్మేంద్రరావులను వార్ విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు క్షేమంగా నల్లమల్ల అడవులను నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే మరో బందీ హాంగార్డును డి.బాబురావును మూడు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లను నేరవార్చకపోతే పోలీసులను చంపేస్తామని పీపుల్స్ వార్ విధించిన 48 గంటల గడువు నేపథ్యంలో గత రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నతాస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు.
నల్లమల్ల అడవుల్లో పోలీసుల గాలింపు చర్యలు నిలిపివేయాలన్న డిమాండ్ కు ప్రభుత్వంఓకే చెప్పింది. అలాగే గిరిజనులను వేధించకూడదన్న డిమాండ్ కుసై అంది. అయితే, ఇతర ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేని పరిస్థితి కావున వాటినిఅర్ధం చేసుకోవాలని ప్రభుత్వం పౌరహక్కుల నేతలతో సందేశం పంపినట్లు సమాచారం.ప్రభుత్వం ఇప్పటివరకు వార్ డిమాండ్లను బహిరంగపర్చలేదు.