వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కస్టడీలో ప్రుడెన్షియల్ డైరెక్టర్ మృతి
హైదరాబాద్: కుంభకోణంలో ఇరుక్కున్న ప్రుడెన్షియల్ సహకారఅర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కృష్ణ కుమార్ జ్యుడిషియల్ కస్టడీలో మరణించారు. ఛాతిలో నొప్పి వల్ల ఆయన శనివారం ఉదయం మరణించారని సమాచారం.
ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కృష్ణకుమార్కు హైదరాబాద్లోని చంచల్గుడా జైలులో ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో మృతి చెందారు. కృష్ణకుమార్కు 63 ఏళ్లు. ఆయనను ఈ నెల 7వ తేదీనఅరెస్టు చేశారు. ఆ తర్వాత జ్యుడిష్యల్ కస్టడీకిపంపారు. అప్పటి నుంచి ఆయన చంచల్గూడా జైలులో ఉంటున్నారు.
అంతకు ముందే ఏప్రిల్ 5వ తేదీన బ్యాంక్ చైర్మన్ మురళీధర్ను, ముగ్గురు ఇతర డైరెక్టర్లనుఅరెస్టు చేశారు. తీవ్ర ఆర్థిక అవకతవకలతో బ్యాంక్ దివాళా తీసి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించలేని స్థితితో మూత పడినవిషయం తెలిసిందే.
Comments
Story first published: Saturday, April 12, 2003, 23:53 [IST]