ప్రతి ఇంటికీ కరెంట్ దీపం: పిఎం
గ్యాంగ్టాక్: జలవిద్యుత్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయనున్నట్లు, వచ్చే పదేళ్లలోవిద్యుత్ సరఫరాను ద్విగుణీకృతం చేయనున్నట్లు ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి చెప్పారు. ప్రతి ఇంటికి, ప్రతి రోడ్డుకువిద్యుత్ దీపాల సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.
గ్యాంగ్టాక్ సమీపంలోని సింగ్టమ్ వద్ద తలపెట్టిన 510 మెగావాట్ల తీస్తా జలవిద్యుత్ ఐదవ దశ ప్రాజెక్టు ప్రగతిని ఆయన శనివారం సమీక్షించారు. నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే 2,200 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును జాతీయ జలవిద్యుచ్ఛక్తి సంస్థ పూర్తి చేసిందని, దీని వల్ల ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని, అంతేకాకుండా 12 శాతం ఉచితవిద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
పర్యావరణ కాలుష్యానికి కారణం కాని జలవిద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయనన్నుట్లు ఆయన చెప్పారు.విద్యుత్ రంగాన్ని సరిదిద్దడానికి ఇటీవల పార్లమెంటువిద్యుత్ బిల్లును ఆమోదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారుగుతుండగా మన దేశ ఆర్థిక వ్యవస్థసరైన దిశలో సాగుతోందని ఆయన అన్నారు.