వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కౌంటీకి ముగ్గురు ఇండియన్ క్రికెటర్లు
ముంబాయి: ఫ్రిజెల్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్షిప్లో ముగ్గురు భారత క్రికెటర్లు వేర్వేరు జట్లలో ఆడనున్నారు. ఈ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి.
బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ లీసెస్టెర్షైర్ తరఫున ఆడుతాడు. ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ లాంక్షైర్ తరఫున ఆడుతున్నాడు. మీడియంపేసర్ జవగళ్ శ్రీనాథ్ దుర్హాం తరఫున ఈ పోటీల్లో పాల్గొంటున్నాడు. శ్రీనాథ్ జట్టు బౌలింగ్ కోచ్గా కూడా వ్యవహరిస్తాడు. గతసీజన్లో శ్రీనాథ్ లీసెస్టెర్షైర్ తరఫున ఆడాడు. అతను ఈ నెల 21వ తేదీన జట్టులో చేరుతాడు.
ప్రస్తుతం ఢాకా ట్రయాంగిల్ సిరీస్లో ఆడుతున్నసెహ్వాగ్, హర్బజన్ దాదాపు అదే సమయంలో అక్కడికి చేరుకుంటారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ట్రయాంగిల్ సిరీస్ ఈ నెల 20వ తేదీన ముగుస్తుంది. విశ్రాంతి కావాలనే ఉద్దేశంతో శ్రీనాథ్ ఈ ట్రయాంగిల్ సిరీస్లో ఆడడం లేదు.
Comments
Story first published: Sunday, April 13, 2003, 23:53 [IST]