వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పొరుగు దేశాలతో శాంతి: ప్రధాని
గ్యాంగ్టాక్: పొరుగుదేశాలతో భారత్ ఎల్లవేళలా శాంతిని,స్నేహాన్ని కోరుకుంటుందని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. కానీ ఒక చేతితో ఎవరూ చప్పట్లు కొట్టలేరని ఆయన అన్నారు. పాకిస్థాన్ ప్రస్తావన లేకుండా ఆయన ఈ మాటలన్నారు.
తమ పొరుగదేశాలన్నింటితో భారత్స్నేహాన్ని, శాంతిని కోరుకుంటోందని, కానీ మనం ఒక చేతితో చప్పట్లు కొట్టలేమని, శాంతి ప్రయత్నాలు రెండు వైపుల నుంచి జరగాలని ఆయన అన్నారు. గ్యాంగ్టాక్లో ఏర్పాటయిన ఒక బహిరంగ సభలో ఆయన ఆదివారం ప్రసంగించారు. ఇరాక్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ శాంతికి, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తూ యుద్ధం పరిసమాప్తం కావడం మంచిదయిందని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్, సిక్కింల మధ్య విమానాశ్రయం, ప్రత్యామ్నాయ జాతీయ రహదారి నిర్మాణాలకు రాష్ట్రానికి కేంద్రం 110 కోట్ల రూపాయల సహాయంఅందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Story first published: Sunday, April 13, 2003, 23:53 [IST]