వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొగాడియా అరెస్టు- 15న బంద్
అజ్మీర్: విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు ప్రవీణ్ తొగాడియాను ఆదివారం రాత్రి రాజస్థాన్ పోలీసులుఅరెస్టు చేశారు. త్రిశూలాలు కలిగి వున్నారనే ఆరోపణపై తొగాడియానుఅరెస్టు చేశారు.
తొగాడియా అరెస్టుకు నిరసనగా ఈ నెల 15వ తేదీన రాజస్థాన్ బంద్కు విహెచ్పి పిలుపునిచ్చింది. తొగాడియా 3 వేల మంది భజరంగదళ్ కార్యకర్తలకు త్రిశూలాలు పంపిణీ చేశారు. అజ్మీర్కు 40 కిలోమీటర్ల దూరంలో గల కిషన్గంజ్లో తొగాడియాను పోలీసులుఅరెస్టు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే రాజస్థాన్ ప్రభుత్వం తననుఅరెస్టు చేసిందని తొగాడియా విమర్శించారు.
మత ప్రదేశాల్లో తప్ప ఇతర చోట్ల త్రిశూలాల పంపిణీని, వాటిని కలిగి వుండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన నిషేధించింది.
Comments
Story first published: Monday, April 14, 2003, 23:53 [IST]