వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ: పుష్పరాజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను రెండు నెలల్లో యుద్ధ ప్రాతిపదికపై భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జె.ఆర్‌. పుష్పరాజ్‌ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.

ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తూనే ఉన్నామని, ఇంకా 1902 పోస్టులు ఖాళీగా వున్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికపై భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంత్రులు వస్తువులను, ఉపకరణాలను పంపిణీ చేశారు.

బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌కు గవర్నర్‌ సుర్జిత్‌ సింగ్‌ బర్నాలతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,స్పీకర్‌ కె. ప్రతిభాభారతి, రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, తదితరులు ఘనంగానివాళులర్పించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వారు శ్రద్ధాంజలి ఘటించారు. వర్తమాన ప్రపంచంలో అంబేడ్కర్‌ ఆదర్శపాత్రుడనిస్పీకర్‌ కె. ప్రతిభాభారతి అన్నారు. అంబేడ్కర్‌ కృషి వల్లనే దళితులు ప్రస్తుతం వివిధ రంగాల్లో తమ పాత్రను పోషించగలుగుతున్నారని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) నిరసన వ్యక్తం చేసింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐఎఎస్‌ అధికారిఅర్జునరావుకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని వారువిమర్శించారు. అర్జునరావుకు అన్యాయం జరగడానికికారకుడైన మరో ఐఎఎస్‌ అధికారి సతీష్‌ చంద్రను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X