వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంపై దళిత సంఘం ఆగ్రహాం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సోమవారం అంబేద్కర్‌ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్నఅంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలను వేసిన అనంతరం ఈ సమితి కార్యకర్తలుపెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల కాలంలోసీనియర్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారి అర్జునరావు, ఓ క్యాబినెట్‌ మంత్రిపై ఆయన తీసుకొన్న చర్యలను వారు ఖండించారు.

ఐఎఎస్‌ అధికారి అర్జునరావుకు రాష్ట్ర ప్రభుత్వంఅన్యాయం చేసిందని వారు విమర్శించారు. అర్జునరావుకుఅన్యాయం జరగడానికి కారకుడైన మరో ఐఎఎస్‌అధికారి సతీష్‌ చంద్రను సస్పెండ్‌ చేయాలనివారు డిమాండ్‌ చేశారు.దళితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబువివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తూ...చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల చూపుతోన్నవివక్షను వివరిస్తూ వారు కరపత్రాలు పంచారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వారు నినాదాలు ఆందోళన చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని సమితి కార్యకర్తలను చెదరగొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X