వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజల్లో బాబుపై తీవ్రఅసంతృప్తి: జైపాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని ఏఐసిసి ప్రతినిధి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఆయన అన్నారు.సీఎల్పీ నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చేపడుతోన్న పాదయాత్రలో జైపాల్ రెడ్డి సోమవారం కొద్దిసేపు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వై.ఎస్ పాదయాత్రలకు వస్తోన్న స్పందన బట్టి తెలుగుదేశం విధానాల పట్ల ప్రజలు ఎలావిసిగిపోయి ఉన్నారో అర్థమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ లో పాదయాత్రలపై విభేదాలు లేవని, ఇది పార్టీ యాత్ర అని ఆయన తెలిపారు. వై.ఎస్ ఎంతో చిత్తశుద్దితో ఈ యాత్ర చేపట్టారని,అందుకే ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోందన్నారు.
Comments
Story first published: Monday, April 14, 2003, 23:53 [IST]