వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడికక్కడే ఆగిపోయిన లారీలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లక్షలాది లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అఖిల భారత మోటార్‌ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం అర్థరాత్రి నుంచి లారీల నిరవధిక సమ్మె ప్రారంభమైంది.

డీజిల్‌ ధరల పెంపును ఉపసహరించుకోవాలని, టోల్‌టాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. పాలు, కూరగాయలు, తదితర నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను సమ్మె నుంచిమినహాయించారు. నిత్యావసర సరులకు రవాణాకు,సేవలకు అంతరాయం కలుగకుండా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ లారీ యజమానుల సమ్మె ప్రభావం కనిపించింది.విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాల్లోట్రాన్స్‌పోర్టు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. జాతీయ రహదారులపై వాహనాలు వరుసగా ఆగిపోయాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల శివార్లలో లారీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

నిత్యావసర సరుకుల రవాణాకు, ఇతరసేవలకు ఆర్టీసి బస్సులను వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పాలు, కూరగాయల వంటి నిత్యావసర సరుకుల రవాణాను అడ్డుకోబోమని లారీ యజమానుల సంఘం ప్రకటించింది. అయితే ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 16వ తేదీ నుంచి ఆ వాహనాలు కూడా సమ్మెలో పాల్గొంటాయని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X