ఏక పార్టీ పాలనే కాంగ్రెస్ ధ్యేయం
చెన్నై: వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏకపార్టీ పాలనకే తాము ప్రాధాన్యం ఇస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) ప్రధాన ఎన్నికల కమీషనర్, సీనియర్ కాంగ్రెస్ నేత రామ్ నివాస్మిర్దా అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నదని,అందువల్ల కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తాము సుముఖం కాదని ఆయన అన్నారు.
తమిళనాడులో రాజకీయ నాయకుల, జర్నలిస్టుల అర్థరాత్రిఅరెస్టులకు తాము వ్యతిరేకమని, ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వ చర్యలను తాము ఆమోదించలేమని ఆయన మంగళవారంవిలేకరులతో అన్నారు.
అన్నాడియంకె ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు తమిళనాడులో 356 ఆర్టికల్ను ప్రయోగించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్కుమీ మద్దతు ఉంటుందా అని అడిగితే ఈ ఆర్టికల్ ప్రయోగమనేది చాలా తీవ్రమైనవిషయమని, దీన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రయోగించాలని ఆయన జవాబిచ్చారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డి) నుంచి డిఎంకె వైదొలగాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్నవిజ్ఞప్తిని కాంగ్రెస్ బలపరుస్తుందా అని అడిగితే ఆవిషయాన్ని డిఎంకెనే తేల్చుకోవాలని ఆయన సమాధానమిచ్చారు.