తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.పెట్రోల్ ధర లీటరుకు రూ.1.08 పైసలు, డీజిల్ ధర లీటరుకు రూ.1.18 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల బేజారైన వినియోగదారులకు ఈ తగ్గింపు కొంత ఊరట కలిగిస్తుంది.
ఈ సారి బడ్జెట్ లో పెట్రోల్,ఢీజిల్ ధరలపై రూపాయిన్నర మేరకు పెంచారు. అదీ కాకుండా ఇరాక్యుద్దం ప్రారంభంలో అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరడగంతో దేశీయ పెట్రోల్ కంపెనీలుమరో రూపాయన్నర మేరకు పెంచాయి. దీంతోహైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 38 రూపాయిలకుపెరగగా, డీజిల్ ధరలు 25 రూపాయలకు పెరిగింది.దేశవ్యాప్తంగా లారీ యజయానుల సమ్మెను విరమింపచేయాలంటే కనీసం రూపాయన్నర తగ్గించాలని ప్రభుత్వంయోచిస్తోంది. అయితే, ఇందుకు పెట్రోల్ కంపెనీలు అంగీకరించడంలేదని సమాచారం ఈ సాయంత్రానికి ప్రభుత్వంధరల తగ్గింపును ప్రకటిస్తుంది.