వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో లారీల సమ్మె ఉధృతం!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లారీ యజమాన సంఘాలు చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరుకొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేయాలని రాష్ట్రట్రాన్స్‌ పోర్టర్ల సంఘం నిర్ణయించింది. పాలు, కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసర సరుకుల రవాణాను నిలిపివేయాలని నిర్ణయించింది.పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూపాయి మేరకు తగ్గించినప్పటికీ అన్ని డిమాండ్లను పరిష్కరించేంతరకు సమ్మెను కొనసాగిస్తామని అఖిలభారత లారీ యజమానులసంఘం, ట్రాన్స్‌ పోర్టర్లు సంఘం ఓ సంయుక్త ప్రకటనలో ప్రకటించాయి.

మరోవైపు, రాష్ట్రంలో ఇప్పటికే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. గురువారం నాటికి ఇప్పుడు మార్కెట్‌ లో ఉన్న సరుకుల నిల్వలు తగ్గిపోతాయని, దీంతోవీటి ధరలు మరింత ఆకాశానికి చేరువ అవుతాయని మార్కెట్‌ వర్గాలుపేర్కొంటున్నాయి.

మరోవైపు, ఆర్టీసీ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేవిషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం సరుకుల రవాణా చేసే 27 లక్షలకుపైగా లారీలు ఎక్కడికక్కడే స్థంభించగా, సమ్మె ప్రభావం మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటకలలో అధికంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X