వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది నక్సల్స్‌ లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు 11 మంది బుధవారం పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)పేర్వారం రాములు ముందు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం బస్సు దగ్ధం సంఘటనలో నిందితుడు,పీపుల్స్‌వార్‌ జిల్లా కమిటీ సభ్యుడు ఇంద్రయ్య అలియాస్‌ కిరణ్‌ కూడా ఉన్నాడు. వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలోని చింతగూడెం వద్దపీపుల్స్‌వార్‌ ఒక బస్సును దగ్ధం చేయడంతో 14 మంది అమాయక ప్రయాణికులు మరణించారు.

పీపుల్స్‌వార్‌ విధానాలతో విభేదించే తాము బయటకు వచ్చామని లొంగిపోయిన నక్సలైట్లు చెప్పారు.పీపుల్స్‌వార్‌లో డిసిఎం స్థాయికి ఎదిగిన రఫా అలియాస్‌ రమణ కూడా పోలీసులకు లొంగిపోయినవారిలో ఉన్నాడు. ఈయననుపీపుల్స్‌వార్‌ సస్పెండ్‌ చేసింది. లొంగిపోయిన నక్సలైట్లలో ఐదుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయినవారిలోపీపుల్స్‌వార్‌ ఒక కమాండర్‌ ఉన్నాడు.

లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించేందుకు వంద కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని డిజిపిపేర్వారం రాములు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లపై కేసులు ఎత్తివేసేవిషయంలో ఉన్నత స్థాయి కమిటీ సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X