వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగుబాటుకు వైయస్‌ పిలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: కరువు సహాయంపై రాష్ట్ర ప్రభుత్వంమీద తిరుగుబాటు చేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తన పాదయాత్ర ఎనిమిదో రోజు బుధవారం ఆయన మెదక్‌ జిల్లాలోని శివంపేట, సింగూరు ప్రాంతాల్లో తిరిగారు.

ఎన్నికల ప్రచారం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనపై చేసినవిమర్శను ఆయన ఖండించారు. ప్రజలకు ధైర్యం చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నానని ఆయన చెప్పారు. కరువు పీడితులను స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X