రైతుపై కలెక్టర్ చేయి: రాస్తారోకో
నల్లగొండ/హైదరాబాద్: ఒక రైతుపై నల్లగొండ జిల్లా కలెక్టర్ సిసోడియా చేయి చేసుకున్నారు. ఇందుకుపెద్ద యెత్తున నిరసన వ్యకమైంది. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ చర్యకు నిరసనగా భువనగిరిలో రాస్తారోకో నిర్వహించారు.
సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి- కరువు సహాయచ చర్యల కింద కలెక్టర్ సిసోడియా పశుగ్రాసం పంచుతుండగా రామిరెడ్డి అనే రైతు ఆ పశుగ్రాసం ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారంటూ ప్రశ్నించాడు. అతని ప్రశ్నలకు కలెక్టర్ అగ్రహోదగ్రులయ్యారు. రామిరెడ్డిపై సిసోడియా చేయి చేసుకోవడమే కాకుండా అతన్ని బయటకు తోసకుంటూ తీసికెళ్లారు. కలెక్టర్ చర్యకు నిరసనగా వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రజలు రాస్తారోకో నిర్వహించారు.
కలెక్టర్ సిసోడియా చర్యపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. సిసోడియా చర్యను అధికారుల గుండాయిజంగా ఆయన అభివర్ణించారు. ఒక రైతు నిలదీయడం తప్పా అని ఆయన అడిగారు. ఇది ప్రజాస్వామ్యామా,బ్రిటిష్ పాలనా అని ఆయన ఆగ్రహంగా అడిగారు. సిసోడియాను సస్పెండ్ చేసి, ఆయనపై కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.