వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొలి సార్స్ కేసు గోవాలో నమోదు
న్యూఢిల్లీ: ప్రాణాంతమైనసార్స్ (సివ్యర్ అక్యూట్ రిస్పరేటరీ సిండ్రోమ్) వ్యాధి తొలి కేసు మనదేశంలో గోవాలో నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. ముఫ్పై రెండేళ్ళ ఈ రోగి ఇటీవలే సింగపూర్ నుంచి తిరిగివచ్చారు. తీవ్రజ్వరం రావడంతో ఈ నెల 10న గోవా మెడికల్ కళాశాల ఆసుప్రతిలో ఆయన చేరారు.
ఎక్స్ రేలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించకపోవడంతో పాటు జ్వరం పూర్తిగా తగ్గడంతో రెండు రోజుల అనంతరం ఆయనను డిశ్ఛార్జి చేశారు. ఆయన నుంచిసేకరించిన రక్తం, మలం శాంపుల్స్ ను పుణలో ఉన్న నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీకుపంపగా, అక్కడ వైద్యులు ఆయన రక్తంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ వైరస్ ద్వారానే సార్స్ వ్యాధి సోకుతుంది. ఈయన మెరైన్ ఇంజనీర్. ఉద్యోగరీత్యా సింగపూర్ వెళ్ళి వచ్చాడు. అక్కడే ఈ వ్యాధి అతనికి సోకినట్లు వైద్యులు చెపుతున్నారు.
Comments
Story first published: Thursday, April 17, 2003, 23:53 [IST]