వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లారీ సమ్మె: ఆంధ్ర ప్రభుత్వం చర్చలు
హైదరాబాద్: రాష్ట్ర లారీ యజమానుల సంఘం నాయకులతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. రవాణా శాఖ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి నేతృత్వంలో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.
జాతీయ స్థాయిలో పెట్టిన 7 డిమాండ్లకు తోడు రాష్ట్ర లారీ యజమానుల సంఘం మరో ఐదు డిమాండ్లను చేర్చింది. లారీలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, పోలీసుల వేధింపులువిరమించుకోవాలని రాష్ట్ర లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తోంది. తమ జాతీయ స్థాయి డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేయించాలని లారీ యజమానుల సంఘం ప్రయత్నిస్తోంది.
లారీల సమ్మెతో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలుపెరిగాయి. మిర్చి, తదితర పంటల రవాణా సాధ్యం కాక రైతులు విలవిలలాడుతున్నారు.పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
Comments
Story first published: Thursday, April 17, 2003, 23:53 [IST]