వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరుగారిన నీరు-మీరు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-మీరు కార్యక్రమం వల్ల ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన గురువారం మెదక్‌ జిల్లాలోని జోగిపేట, తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

1600 కోట్ల రూపాయలతో అమలు చేసిన నీరు-మీరు కార్యక్రమం వల్ల ఏ విధమైన మేలు జరగలేదని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా రైతులను దగా చేసి సింగూరు రిజర్వాయర్‌ నీటిని జంటనగరాల మంచినీటికిఅందిస్తున్నారని, నీరు-మీరు కార్యక్రమానికి ఖర్చు చేసిన డబ్బులో సగం ఖర్చు చేసినా కృష్ణా జలాలను జంటనగరాలకు తరలించి వుండేవారని, అప్పుడు సింగూరు జలాలు మెదక్‌ రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడి ఉండేవని ఆయన అన్నారు. ఎండిపోయిన జోగిపేట చెరువును ఆయన చూశారు.
పనికి ఆహారం పథకం కింది బియ్యం, జన్మభూమి డబ్బులు తెలుగుదేశం కార్యకర్తల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆయనవిమర్శించారు. పనికి ఆహారం పథకం కింద ఇస్తున్న బియ్యాన్ని కొందరు రాజశేఖర్‌ రెడ్డికి చూపించారు. కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని తెలుగుదేశం కార్యకర్తలు దారి మళ్లించి ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నాయని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

పది కిలోమీటర్ల వరకు జరిగిన రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రలోపెద్ద యెత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు, సిఎల్‌పి ఉప నాయకుడుపి. శంకరరావు, తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగుతున్న రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రజాసమస్యలను చూపిస్తోందని సత్యనారాయణ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకువిజ్ఞప్తి చేశారు. రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చాముండేశ్వరి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X