లారీ సమ్మె: స్థంభించిన సరుకుల రవాణా
హైదరాబాద్: లారీల సమ్మె పరిష్కారం ఇప్పట్లో కన్పించడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు లారీల యజమాన్య సంఘాలు పట్టు వీడకపోవడంతో సమ్మె ఐదో రోజుకు చేరింది. దాదాపు అన్ని ప్రధాన సరుకుల రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. పాలు, నిత్యావసర సరుకుల పంపిణీకి ఢోకా లేదని ప్రభుత్వం చెపుతోన్న వాస్తవ పరిస్థితిఅందుకు విరుద్దంగా ఉంది. శుక్రవారం హైదరాబాద్ లో పలుచోట్ల ఏడుగంటలకే పాలు దొరకని పరిస్థితి ఉంది.
రాష్ట్రప్రభుత్వం తన పరిధిలోనిఅంశాల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినప్పటికీ, పోలీసుల వేధింపులు, టోల్ గేట్ ట్యాక్స్ పై కచ్చితమైన హామీ ఇవ్వాలని సంఘాల ప్రతినిధులు పట్టుబడుతున్నారు. వినియోగ ఛార్జీల రద్దు, కోటి రూపాయల్లోపు వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్ లపై టోల్ ట్యాక్స్ వేయడం మానాలని, మున్సిపాలిటీలు, పంచాయితీలు కూడా లారీలపై పన్నులు వేయకూడదని స్థానిక డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం రాష్ట్రప్రభుత్వానికివివరించింది.
సమ్మె
మరింత
ఉధృతం
ప్రభుత్వం
ఇంకా
మొండికేస్తే
సమ్మెను
మరింత
ఉధృతం
చేస్తామని
సంఘం
అధ్యక్షుడు
పి.గోపాలనాయుడు
హెచ్చరించారు.
నిర్ధిష్టమైన
హామీ
ఇస్తేనే
సమ్మెవిరమిస్తామని
స్పష్టం
చేశారు.