ఢిల్లీలో పాండ్యహంతకుల విచారణ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్య హత్యకేసులో గురువారం పట్టుబడ్డ నలుగురి నిందితులనుసీబీఐ శుక్రవారం న్యూఢిల్లీ లోని సీబిఐ ప్రధానకార్యాలయంలో విచారించనుంది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడైనఅస్ఘర్ అలీకి ఐ.ఎస్.ఐతో సంబంధాలున్నాయని బయటపడింది.సీబీఐ ప్రత్యేక బృందం, సైబరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లోఅస్ఘర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ బఆరీ, సయ్యద్ ఇప్తెకార్, అబ్దుల్ రవూప్ లో పట్టుబడ్డారు.
మార్చి 26న పాండ్య తనస్వగృహం వద్ద హత్యకు గురయ్యారు. ఈ నలుగురులో ఒకరికిమినహా మిగతా ముగ్గురికి నేర చరిత్ర ఉంది. మరోవైపు, ఈ నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడంతో రాష్ట్ర పోలీసు శాఖఉలిక్కిపడింది.
హైదరాబాద్ ఐ.ఎస్.ఐ తీవ్రవాదులకు స్థావరంగా మారిందని వస్తోన్న వార్తలకు మరోసారి ఈ ఘటన బలాన్నిచ్చింది.పెద్ద ఎత్తున ఐ.ఎస్.ఐ తీవ్రవాదుల గుర్తింపు, ఏరివేత చర్యలను ప్రారంభించనున్నట్లు శుక్రవారం డీజీపీపేర్వారం రాములు విలేకరులతో తెలిపారు.