వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రకాశం జిల్లాలో వార్ కరువు దాడులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని రెండు గ్రామాల్లో కరువు దాడులు చేశారు. ఆహారధాన్యాలను లూటీ చేశారు.
ఎర్రగొండపాలెం మండలంలోని కొలుకుల, వీరభద్రాపురం గ్రామాల్లోని ఆరు ఇళ్లపై నక్సల్స్ దాడులు చేశారు. అటుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఆపిఅందులోని డ్రైవర్ను, కండక్టరును దింపేసి ఆ బస్సును నక్సలైట్లు కరువుదాడికి వాడుకున్నారు. తాము లూటీ చేసిన ఆహారధాన్యాలను ఆ బస్సులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ దాడుల్లో ఒక వ్యక్తి మరణించాడు.
Comments
Story first published: Saturday, April 19, 2003, 23:53 [IST]