వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ కుట్రలు సాగవు: వాజ్పేయి
శ్రీనగర్: దశాబ్దానికి పైగా జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ హింసను ప్రోత్సహిస్తోందని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి విమర్శించారు. పాకిస్థాన్ కుతంత్రాలు సాగబోవని ఆయన అన్నారు.
కేంద్రం పాకిస్థాన్ ఆటలను సాగినవ్వదని ఆయన శనివారం ఇక్కడివిశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో స్పష్టం చేశారు. పాకిస్థాన్తో చర్చలకు సిద్ధమేనంటూ ఆయన శుక్రవారంస్నేహహస్తం చాచిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రగతికి ఇక్కడి ప్రభుత్వతానికి పూర్తి సహకారంఅందిస్తామని ఆయన మరోసారి చెప్పారు. స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంచి చర్యలు చేపట్టిందని ఆయన ప్రశంసించారు.
Comments
Story first published: Saturday, April 19, 2003, 23:53 [IST]