తుపాకి సంస్కృతి వద్దు: వాజ్పేయి
శ్రీనగర్: తుపాకి సంస్కృతికిస్వస్తి చెప్పాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాశ్మీరీలనుకోరారు. కాశ్మీర్లో మిలిటెన్సీని బలపరిచేవారు కాశ్మీరీ సాంస్కృతిక మూలాలకు, సూఫీ ఇస్లామ్కు వ్యతిరేకులని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితిని నిష్పాక్షికంగా పరిశీలిస్తేమిలిటెన్సీని బలపరిచేవారు కాశ్మీరీల శాంతికాముక సంస్కృతికి, సహోదరత్వానికి,స్నేహానికి వ్యతిరేకులని తెలుస్తుందని ఆయన అన్నారు.తుపాకి సంస్కృతికి స్వస్తి చెప్పాలని ఆయన కాశ్మీరీలను కోరుతూ హిందూముస్లింలను విభజించవద్దు అనే కాశ్మీరీ తత్వవేత్త పంక్తులను ఉటంకించారు. ప్రముఖ తత్వవేత్తల, కవుల మాటలను ఆయన పుంఖానుపుంఖంగా ఉటంకిస్తూ కాశ్మీర్లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మతసామరస్యాన్ని, జాతీయ ఐక్యతను ప్రభోదించాల్సిన బాధ్యత మేధావులు, మీడియా, కళకారులు, రాజకీయ కార్యకర్తలపై ఉన్నదని అన్నారు.
ఎన్నికలను కొన్ని స్వార్థశక్తులు మరో విధంగా చూపే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని ఆయన చెప్పారు.