పరగోడుపై సుప్రీంకి: రాష్ట్రప్రభుత్వం
హైదరాబాద్: పరగోడుప్రాజెక్ట్విషయంలో కర్నాటక దుందుడుకు వైఖరిని నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.పరగోడు విషయంలో కర్నాటక కేంద్రం సలహాను కూడా పెడచెవినపెట్టిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరివిమర్శించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు భిన్నంగా కర్నాటక వ్యవహరిస్తోందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతామని ఆయన శనివారంవిలేకరులతో చెప్పారు.
పరగోడు ప్రాజెక్ట్ పనులు రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, తమ అభ్యంతరాలను కర్నాటకు తెలియచేశామని,అయినప్పటికీ కర్నాటక ప్రభుత్వం రాష్ట్రవాదనలను పెడచెవిన పెడుతోందని ఆయనవిమర్శించారు. మన అభ్యంతరాలను, విజ్ఞప్తులను...వేటినీ వారు పట్టించుకోవడం లేదు. కేంద్రం ఇచ్చిన సలహాను కూడా వారు పెడచెవినపెట్టారు. అందుకే సుప్రీంలో మన వాదనను విన్పించి..కర్ణాటకను అడ్డుకోవాలని నిర్ణయించామని కడియం తెలిపారు.