వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొనసాగుతున్న లారీల సమ్మె
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలువిఫలం కావడంతో లారీ సమ్మె శనివారం కూడా కొనసాగుతోంది. ట్రక్కర్లకు, ప్రభుత్వానికి మధ్య శనివారమో, ఆదివారమో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.
ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాశ్మీర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ చర్చలు జరుగతాయని సమాచారం. ట్రక్కర్ల సమ్మెకొనసాగుతుండడంతో నిత్యావసర సరుల ధరలు విపరీతంగాపెరిగిపోయాయి. ఈ స్థితిలో లారీల సమ్మెను పరిష్కరించాలని రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడిపెరుగుతోంది. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వ్యాట్, తదితరఅంశాల విషయంలో ఒక మెట్టు దిగిరావచ్చునని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని అటల్బిహారీ వాజ్పేయితో ఈ విషయం మాట్లాడే అవకాశాలున్నాయి. సమ్మె పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాల్సిందిగా ట్రక్టర్లు ఆయనను కోరినవిషయం తెలిసిందే.
Comments
Story first published: Saturday, April 19, 2003, 23:53 [IST]