ఇక హనుమంతరావు రథయాత్ర
హైదరాబాద్: ప్రస్తుతం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తోన్న పాదయాత్రల మాదిరిగానే కాంగ్రెస్ లోని ఒక వర్గంరథయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిఅయిన వి.హనుమంతరావు సోనియా జనసందేశ్పేరిట రథయాత్రలను చేపట్టనున్నారు.
ఆదివారం ఆయనవిలేకరులకు ఈ యాత్ర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 11 జిల్లాల్లో మాత్రమే పాదయాత్రలను నిర్వహిస్తున్నందున ఇతర జిల్లాల్లోనూ కరువుతో అల్లాడుతోన్న రైతుల గోడువినేందుకు ఈ యాత్రను చేపడుతున్నట్లు ఆయనవివరించారు. వై.ఎస్ కు లభిస్తోన్న ప్రజాదరణను భరించేలేకే, పోటీగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన లేదన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.సీఎల్పీ నేత 11 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్సమైక్యంగా ఉండి వై.ఎస్ కు మద్దతుగా మిగతా జిల్లాల్లోనూ యాత్రలను నిర్వహించాలనే భాగంగా నేను ఈ యాత్రను చేపడుతున్నానని ఆయనవిలేకరులకు వివరించారు.
రాష్ట్రపీసీసీ
అధ్యక్షుడు
ఎం.సత్యనారయణరావు
జెండా
ఊపి
ఈ
యాత్రను
ప్రారంభిస్తారని
ఆయన
తెలిపారు.
ఈ
యాత్ర
15
రోజుల
పాటు
సాగుతుంది.