వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొగాడియాకు బెయిల్ మంజూరు
అజ్మీర్:విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు ప్రవీణ్ తొగాడియాకు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. త్రిశూలాల పంపణీపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించారని, రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపిస్తూ ఆయనను ఈ నెల 13వ తేదీనఅరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 13వ తేదీ నుంచి జ్యుడిష్యల్ కస్టడీలో ఉన్న ప్రవీణ్ తొగాడియా బెయిల్ దరఖాస్తును జిల్లా, సెషన్స్ జడ్జి హరి సింగ్ పూణియా అంగీకరించారు. 40 వేల రూపాయల బాండ్పై తొగాడియాను విడుదల చేయాలని కోర్టు ఆదేశించినట్లు కలెక్టర్ నిరంజన్ ఆర్య విలేకరులకు చెప్పారు. నిషేధ ఉత్తర్వులను, త్రిశూలాల పంపిణీపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించకూడదని కోర్టు తొగాడియాను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
Story first published: Monday, April 21, 2003, 23:53 [IST]