వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిబిఐ కస్టడీకి పాండ్యా కేసు నిందితులు
అహ్మదాబాద్: గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులను పది రోజుల పాటు సిబిఐ కస్టడీకి రిమాండ్ చేశారు. బుధవారం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఐఎస్ఐ శిక్షణ పొందిన అస్ఘర్ అలీతో పాటు ఐదుగురు నిందితులను ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మేఘానినగర్ రాణిక్ షా ముందు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య హాజరు పరిచారు. ప్రధాన షూటర్ అని భావిస్తున్న అస్ఘర్ అలీతో పాటు అబ్దుల్ బకర్, అబ్దుల్ రవూఫ్, మొహ్మద్ ఇఫ్తెకార్, మొహ్మద్ షఫీలను ఈ నెల 30వ తేదీ రిమాండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Story first published: Monday, April 21, 2003, 23:53 [IST]